నల్లబెల్లి, జూన్ 1 : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంలోని పల్లె ప్రకృతి వనం బుధవారం మంటల్లో కాలిపోయింది. సుమారు వందకు పైగా మొక్కలు, చెట్లు అగ్నికి ఆహూతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు వనానికి నిప్పు పెట్టడం వల్లే కాలిపోయిందని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి పద్మనాభస్వామి పోలీసులకు ఫిర్యాదుచేశారు.