హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఏపీలోని తిరుపతి జిల్లా గూడూరు రైల్వేస్టేషన్లో నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో మంట లు చెలరేగాయి. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ రైలు గూడూరు జంక్షన్కు చేరుకోగానే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
రైలులోని ప్యాంట్రీకార్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో వెంటనే అగ్నిమాపక, రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సగం బోగీ కాలిపోయింది. ప్రమాదానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా సుమా రు గంటపాటు రైలు నిలిచిపోయింది.