నారాయణపేట : నారాయణపేట(Narayanapet) జిల్లా మాగనూరు మండలంలోని బసవేశ్వర కాటన్ మిల్లో(Cotton Mill) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో(Short circuit) నిల్వ చేసిన పత్తి దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు.
సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో పత్తి, పత్తి గింజలు, షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ. 7 నుంచి 8కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిళ్లినట్లు మిల్లు యజమాని దండే తమ్మన్న తెలిపారు. సంఘటన స్థలాన్ని మిల్లు ఎమ్మెల్యే శ్రీహరి పరామర్శించారు.