హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని స్టేట్ ఫైర్ ట్రైనింగ్ స్కూల్లో ఆదివారం అమరులకు నివాళులర్పించి ఈ వారోత్సవాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఫైర్ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు తమ సిబ్బం ది అవగాహన కల్పిస్తారని చెప్పారు.