హైదరాబాద్ : నగరంలోని అత్తాపూర్లో ఘోరం జరిగింది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 202 పిల్లర్ వద్ద నిలిపి ఉంచిన బీఎండబ్ల్యూ కారులో ఆకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో భయపడ్డ స్థానికులు దూరంగా పరుగెత్తారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.