కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిగురుజు దగ్గర గల ఈ కట్టెల మండిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ, భారీగా ఆస్తినష్టం సంభవించిందని చెప్పారు. టింబర్ డిపోలో ఉన్న కలప పూర్తిగా దగ్ధమైందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.