హైదరాబాద్: పాతబస్తీలోని ఛత్రినాకలో భారీ పేలుడు సంభవించింది. ఛత్రినాక పరిధిలోని కందికల్ గేట్ వద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో విగ్రహాలు తయారు చేసే పరిశ్రమలో పటాకులు కాల్చడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు మరణించగా అక్కడికక్కడే మృతిచెంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుగల కారణాలను గుర్తించడానికి క్లూస్ టీమ్ను రప్పించారు. మృతులను పశ్చిమ బెంగాల్కు చెందిన విష్ణు, జగన్గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
కాగా, విగ్రహ తయారీ పరిశ్రమలో పటాకుల కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పటాకులకు కెమికల్స్ తోడవడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.