కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ ఈ-సేవా కేంద్రంలో (Passport E-Office) భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.