కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్ణంలోని శ్రీపురం కాలనీలో ఉన్న గోనెసంచుల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాము మొత్తం వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్య్కూట్ వల్లే మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, గోదాములో 40 వేల గోనెసంచులు ఉన్నాయని, ప్రమాదంలో అన్నీ కాలిపోయాయని యజమాని వాపోయారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.