రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి అత్తాపూర్లోని కార్ల షెడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జనప్రియ ఉటోపియా వద్ద ఉన్న కార్ల షెడ్డులో మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి తరలించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నది. మంటల్లో మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి విలువైన కార్లు మంటల్లో బూడిదయ్యాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 15 ఖరీదైన కార్లు దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.