మందమర్రి, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన ఇద్దరు పేద వైద్య విద్యార్థులకు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆర్థిక చేయూతనందించారు. పట్టణంలోని పాలచెట్టు ఏరియాకు చెందిన సెగ్గం తార, వెంకటి దంపతుల కుమారుడు అక్షయ్ నల్లగొండలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కనీసం ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న వారి ఆర్థ్ధిక పరిస్థితిని స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న బాల్క సుమన్ మంగళవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్షయ్కు రూ.50 వేలు అందజేశారు. అదే విధంగా విక్రం రాజు అనే విద్యార్థికి రూ.లక్ష సాయం చేశారు.