CM KCR | కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రూ.లక్ష చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలు ఇందుకు సంబంధించి అమలు విధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్, మంత్రి గంగుల కమలాకర్ సీఎంకు వివరించారు.
త్వరిత గతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, సీఎంఓ శ్రీధర్ దేశ్ పాండే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఈఈ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.