సుల్తాన్బజార్, ఏప్రిల్ 18: ప్రభుత్వంలోని ఆర్థికశాఖ విభాగాల్లో పనులు, ప్రాజెక్టులకు సంబంధించిన వర్క్స్ అకౌంట్స్శాఖ ఎంతో కీలకమైనదని ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఆర్థికశాఖ డీఏవో అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్థికశాఖలో విధులు నిర్వర్తించే డీఏవోలు మరింత బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన డివిజనల్ అకౌంట్స్ అధికారుల సంఘం, డైరెక్టరేట్ రూపొందించిన శిక్షణ మెటీరియల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ డైరెక్టర్ ఫణిభూషణ్శర్మ, జేడీలు రజని, శైలజారాణి, శ్రీనివాస్రాజు, డీఏవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహియుద్దీన్, కార్యదర్శి రాధారమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.