ఎల్లారెడ్డి, ఆగస్టు 26: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం బీజేపీ నాయకులు ముష్టి యుద్ధానికి దిగారు. బండ బూతులు తిట్టుకుంటూ, గల్లాలు పట్టుకొని కొట్లాటకు దిగారు. పార్టీ పరిశీలకుడు, బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలోని బాలాగౌడ్ ఫంక్షన్హాల్లో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదని జాతీయ కార్యవర్గ సభ్యుడు పైల కృష్ణారెడ్డి ప్రశ్నించడంతో బీసీ మోర్ఛా కార్యవర్గ సభ్యుడు బైండ్ల పోచయ్య మధ్య వాగ్వాదం తీవ్రమైంది.
ఆ పార్టీ పరిశీలకుడు బీపీ హరీశ్ ముందే బూతులు తిట్టుకుంటూ చొక్కాలు చింపుకోవడంతో ఆయన అవాక్కయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించి అదే పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు ఫొటోలు తీయగా, గమనించిన నాయకులు అతని సెల్ఫోన్ను బలవంతంగా లాక్కుని డిలీట్ చేయించినట్టు తెలిసింది.