హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తమను విధుల్లో చేరాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కవితను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 7,000 మందిపైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్, టీఆర్ఎస్ కార్మిక విభాగం ఇన్చార్జి రూప్సింగ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.