హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): 2024-25 సంవత్సరానికి గాను ఎరువుల సరఫరా, నిల్వకు సంబంధించిన చర్యలపై మంగళవారం వ్యవసాయశాఖ కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వారినే ఈ ఏడాది కొనసాగించాలా? లేదందే, కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలా? అనే అంశంపై చర్చించారు. ఇటీవల పలు ప్రాంతాల్లో ఎరువుల కొరత ఏర్పడింది. దీనికి కారణం ప్రస్తుత ఏజెన్సీ నిర్లక్ష్యమే కారణమని, ఎరువుల సరఫరాలో ఆ సంస్థ విలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్కే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనిపై అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమీక్షలో వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్, మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.