అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సన్మానం
హైదరాబాద్, మార్చి 10 : ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రి సన్మానించారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు సీతక్క, బానోతు హరిప్రియ, పద్మాదేవేందర్రెడ్డి, రేఖానాయక్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఉన్నారు.