షాబాద్, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ను ఈ ఏడాది (2022-23)కి రద్దు చేసిందని, మైనార్టీ విద్యార్థులకు దీనిని వెంటనే మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు.
సోమవారం లోక్సభలో ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ ఈ ఫెలోషిప్ను పునరుద్ధరణ చేయాలని కోరారు. రూ.6 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న మైనార్టీ కుటుంబాలకు చెందిన ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ వర్తింపజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేసిందో తెలియడం లేదని పేర్కొన్నారు.