సివిల్స్ సాధించిన ఇంజినీర్లే నిదర్శనం
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి
సివిల్స్ ర్యాంకర్లకు ఘనంగా సన్మానం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఎంతో శ్రమిస్తే తప్ప అద్భుత విజయాలు సాధ్యం కావని, ఇందుకు ఇటీవల సివిల్స్లో మంచి ర్యాంకులు సాధించిన ఇంజినీర్లే నిదర్శనమని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. వారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సివిల్స్ సాధించిన ఇంజినీర్లకు ఇంజినీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఐఈఐ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో బుధవారం సన్మానం ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి పదుల సంఖ్యలో ఇంజినీర్లు సివిల్ సర్వీసెస్లో ర్యాంకు సాధించడం గర్వకారణమని అన్నారు. తొలుత రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఐఆర్ఎస్ అధికారి యశ్వంత్రావు ఉద్యోగార్థులకు విలువైన సూచనలు ఇచ్చారు. సివిల్స్లో విజయం సాధించిన ఇంజినీర్లు చైతన్య (161), సాస్య (214), శ్రీధర్ (336), అనన్య ప్రియ (544), పవిత్ర (608), సమ్రాన్ రాజ్(676)ను శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్రెడ్డి, ఐఈఐ చైర్మన్ బ్రహ్మారెడ్డి, ఇంజినీర్ జేఏసీ చైర్మన్ తన్నీరు వెంకటేశం, ఐఈఐ చైర్మన్ (ఆర్అండ్డీ) రమణానాయక్, డీఈ రమాదేవి, నర్మదా, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు ఇంజినీర్ల కృతజ్ఞతలు
అడ్హాక్ ప్రమోషన్లకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్కు ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీనియార్టీ అంశం కొలిక్కి రాకపోవడంతో ఎన్నో ఏండ్లుగా ఇంజినీర్ల ప్రమోషన్లు ఆగిపోయాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ప్రమోషన్లను ఇవ్వాలని నిర్ణయించింది. అందులోనూ డీఈఈల స్థాయిలో కొంత చిక్కులు ఏర్పడ్డాయి. వాటిపై ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. వివిధ జోన్ల నుంచి ఒకేసారి ఇద్దరు, అంతకంటే ఎకువ మంది డీఈఈలుగా ప్రమోషన్ పొందినప్పుడు అందులో ఎవరు డీఈఈ ఫీడర్ క్యాటగిరీలో ముందు ఉన్నారో వారిని సీనియర్గా నిర్ణయించాలని నిర్దేశించింది. ఈ మేరకు అడ్హాక్ ప్రమోషన్ లిస్టును రివైజ్ చేసి పంపాలని ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్కుమార్కు చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటేశం, మహేందర్, ప్రెసిడెంట్ ఏఎస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, వరింగ్ ప్రెసిడెంట్ రవీందర్, ట్రెజర్ శ్రీనివాస్రెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.