చిక్కడపల్లి, జూలై 1 : ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం, అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల మాట్లాడుతూ బంద్ను విజయవంతం చేయాలని కోరారు.