BRS MLAs : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు వారు ర్యాలీగా వెళ్లారు.
అయితే ప్లకార్డులతో అసెంబ్లీ గేటు దగ్గరికి వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను మార్షల్స్ అడ్డుకున్నారు. వారి నుంచి ప్లకార్డులను లాక్కున్నారు. కాగా ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నాలుగోరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన సభలో ఇవాళ ప్రధానంగా బడ్జెట్పై చర్చ జరుగనుంది.
ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.
ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ నాయకులు.
అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు… pic.twitter.com/gAI0wprz1T
— BRS Party (@BRSparty) March 23, 2026