హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ను పాత పద్ధతిలో అమలు చేసి, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 6న హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.