Anil Kurmachalam | తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాపీ కొట్టేందుకే తెలంగాణకు మోదీ వస్తున్నారని ధ్వజమెత్తారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పర్యటనలు చేస్తున్నారు. కానీ తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని నిలదీశారు. అటు విభజన హామీలు, ఇటు రాష్ట్రానికి రావాల్సిన వనరులు అన్నింటిలో తెలంగాణకు అన్యాయమే చేశారని, ఈ దేశంలో తెలంగాణ లేదు అనే విధంగా వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేసి తగిన బుద్ధి చెప్తారని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.