హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నియామకమైన అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో ముఖ్యమైన రోజును గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటి ప్రారంభిస్తున్నానన్నారు. ప్రియతమ నేత ఎంపీ సంతోష్కుమార్ పర్యావరణ పరిరక్షణకు, గ్రినరీని పెంచేందుకు కృషి చేస్తున్నారని, తనవంతు బాధ్యతగా ఇవాళ మొక్కలు నాటినట్లు తెలిపారు. మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందరిపై ఉందన్నారు.