23 వేల ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన ‘ఇండియన్ ఫార్మసీ’
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల కు సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఫేవిరో 400 ఎంజీ ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చింది. అసోసియేషన్ ప్రతినిధులు ఆదివా రం బస్భవన్లో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను కలిసి 23 వేల ట్యాబ్లెట్లను అందజేశారు. టీఎస్ఆర్టీసీ దవాఖాన కోసం ఈ ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన అసోసియేషన్కు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.