Viral News | కోరుట్ల, ఫిబ్రవరి 24: మరో 3 గంటల్లో వివాహతంతు మొదలు కావాల్సి ఉండగా.. వరుడి తండ్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్నది. జగిత్యాల జిల్లా ఆదర్శనగర్కు చెందిన గంగారం-రాజేశ్వరి దంపతుల చిన్న కొడుకు ప్రశాంత్కు మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం ఉదయం 10గంటలకు వివా హం జరిపించేందుకు అంతా సిద్ధమైంది.
కోరుట్లలోని వరుడి ఇంటివద్ద కాళ్లగోళ్ల తంతును తిలకిస్తున్న వరుడి తండ్రి గంగారాం(62) గుండెపోటు తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దవాఖానకు తరలించేలోపు మరణించాడు. ఈ హఠాత్పరిణామంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రెండు నెలల క్రితమే గంగారాం అల్లుడు గుండెపోటుతో మృతి చెందగా, ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో దురదృష్ట ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను కలిచివేసింది.