గంగారం, జూలై 24: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలో మావోయిస్టు అగ్రనేత దివం గత యాప నారాయణ (హరిభూషణ్) తండ్రి రంగయ్య (72) మృతి చెందాడు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించాడు. రంగయ్య భార్య ఐదేండ్ల క్రితమే మృతిచెందగా, ఆయన కుమారుడు హరిభూషణ్ గత ఏడాది కరోనాతో మరణించిన విషయం తెల్సిందే.