తొర్రూరు, ఏప్రిల్ 2 8: కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల వందేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. కన్నబిడ్డల కు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావలి(30)కి అదే గ్రామానికి చెందిన శాంతతో వివాహం జరిగింది. గుంషావలి తొర్రూరులో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ జరిగే గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో 15 రోజుల క్రితం జరిగిన గొడవతో శాంత తన ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. గుంషావలి సోమవారం ఉదయం చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇ ద్దరు చిన్నారులు విలాస్ (5), వికేశ్(3)ను తనవెంట తీసుకెళ్లాడు. తొర్రూరు శివారులోని ఖాళీ స్థలంలో వేపచెట్టుకు చిన్నారులకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక దవాఖానకు తరలించారు. శాంత ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉపేందర్ తెలిపారు.