నల్లగొండ: జిల్లాలోని తిప్పర్తి మండలంలో రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దుప్పలపల్లి నుంచి బైక్పై ఐకేపీ కేంద్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో తండ్రి రామలింగయ్య కాలు విరిగిందని, అతని కుమారుడు శివకు తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.