హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. వానకాలం సీజన్తో పోల్చితే సుమారు 13 లక్షల టన్నుల ధాన్యం తక్కువ కొనుగోలు చేయడం గమనార్హం. గతంలో ఇప్పటి వరకు సుమారు 50 లక్షల టన్నుల ధాన్యా న్ని పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేయగా, ప్రస్తుతం 37 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈ నేపథ్యం లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగం చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టి తమకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ఇక ఈ వానకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ నేపథ్యంలో మొత్తం 99.31 లక్షల టన్ను ల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేసింది. ఇం దుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,130 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో 6,416 కేంద్రాలను ప్రారంభించిన పౌరసరఫరాల సంస్థ ఇందు లో 5,215 కేంద్రాల్లోనే కొనుగోలు ప్రక్రియను జరుపుతున్నది. అంటే ఇంకా 1,201 కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉన్నందున ధా న్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.