దేవరుప్పుల : రోహిణికార్తె వచ్చింది.. నిన్న ఇవ్వాళ మబ్బులు కమ్మడంతో రైతులు వానకాలం సాగుకు
సమాయత్తమవుతున్నారు. పొశిలోనే కొందరు పత్తిగింజలు పెడుతుండగా, చినుకుపడితే పత్తిగింజలు విత్తేందుకు మరికొందరు చెలుకలను ఇరువాలు మూడుసాళ్లు దుక్కిదున్ని, గొర్రుకొట్టి, అచ్చుతోలి సిద్ధంగా ఉంచుకొన్నారు.
ఇక వరి సాగు చేసే రైతులు నారుమళ్లకు నీళ్లేసి దున్నుతున్నారు. దేవరుప్పుల కాశవాడ కర్రెగుట్ట కింద ఓ రైతు తన భూమిని ఇలా మెత్తగా దున్నిఅచ్చుతోలి పత్తి గింజలు విత్తేందుకు సిద్ధం చేశాడు.