మనోహరాబాద్, మే 13 : ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు.
రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులతో పాటు వారికి సంఘీబావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.