రుద్రూర్, అక్టోబర్ 29: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల పాల్జేసి నష్టపోవద్దని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలిగించేలా దళారులు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులు తొందర పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.