వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి రైతులు చేసిన ఆందోళనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. హైద్రాబాద్ నుంచిడి జిల్లా కలెక్టర్లు గోపి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మి, మార్కెట్ కార్యదర్శి, వరంగల్ చాంబర్ ప్రతినిధులతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రభుత్వ రైతులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని, రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదన్నారు. గత సంవత్సరం కన్నా ఈసారి పంటలకు మంచి ధరలు ఉన్నాయని, చీడపీడల వ్యాప్తి, ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంటల దిగుబడులు తగ్గాయన్నారు.
రైతులు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతులకు మద్దతు ధరలు వచ్చే విధంగా మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. గిట్టుబాటు ధరలు వచ్చిన రైతులు తమ సరుకులను విక్రయించుకొని, మిగతా రైతులు ఆందోళన చెందకుండా గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్లోని శీతలగిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.