గిర్మాజీపేట, సెప్టెంబర్ 6: అర్హులైన తమకు రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలని రైతులు శుక్రవారం వరంగల్ జేపీఎన్ రోడ్లోని కెనరా బ్యాంకు ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు దేవుళ్ల మీద దొంగ ఒట్లు పెట్టి ఇప్పుడు రుణమాఫీకి అనేక కొర్రీలు పెడితే మూకుమ్మడిగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.