నిజాంపేట్, సెప్టెంబర్ 16 : సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ తహసీల్ ఎదుట బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. కార్యాలయం లో పనులకోసం తహసీల్దార్ నాగజ్యోతి సిబ్బందిచేత డబ్బులు వసూలు చేయిస్తున్నారని, ఎకరం రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
రిజిస్ట్రేషన్కు ఓ రేటు, ఫైల్ కదలాలంటే మరోరేటు అంటూ మధ్యవర్తితో వసూలు చేస్తున్నారని.. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.