నిజామాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. తాజాగా గత మూడు నెలల నుంచి పాడి రైతులకు విజయ డెయిరీ(Vijaya Dairy) బిల్లులు(Pending bills) చెల్లించడం లేదంటూ నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో బోధన్ -బాన్సువాడ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుబంధంగా నడుస్తున్న విజయ డెయిరీ గతంలో ఎప్పుడు బిల్లులు చెల్లింపు విషయంలో ఇంత జాప్యం జరగలేదన్నారు.
సకాలంలో డబ్బులు అందాయని రైతులు గుర్తు చేశారు. నెలనెలా డబ్బులు చెల్లించకపోవడంతో ఈఎంఐలు కట్టుకోవడానికి పాడి బర్ల పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. బిల్లులు చెల్లించేంతవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.