వరంగల్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ విజయగర్జన సభ నిర్వహణకు వరంగల్ మహా నగరంలోని దేవన్నపేట రైతులు బాసటగా నిలిచారు. ఈనెల 29న 15 లక్షల మంది తో నిర్వహించే ఈ బహిరంగ సభకు వంద ఎకరాలు అవసరం కాగా… 130 ఎకరాలు ఇచ్చేందు కు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తమ భూములను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు వీలుగా సదరు రైతులు స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్కు అంగీకార పత్రాలు అందజేశారు. దీంతో సభ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్టర్లు, డోజర్లు, పొైక్లెనర్లతో భూమి చదును చేసే పనులు సోమవారం మొదలయ్యాయి. బహిరంగసభ, వేదిక, పార్కింగ్, ఇతర వసతులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్లను ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.