ఇల్లంతకుంట, ఫిబ్రవరి 13: వేసిన పంటలు ఎండుతున్నాయని, కాల్వకు స్థ లం ఇప్పించి సాగునీరు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామ రైతులు, బీజే పీ నాయకులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు వేసిన పంటలు సాగు నీరు అందక ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా గతంలో ఏటా కాళేశ్వరం జలాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. అప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండటంతో నేరుగా కాలువ లేకున్నా విఠలాపూర్, దాచారం గ్రామ శివారు మీదుగా సుమా రు రెండు కిలోమీటర్ల దూరం సరఫరా చేసి పంటలకు ఇచ్చేవారని గుర్తుచేశారు. ఇప్పుడు అన్ని నీళ్లు లేకపోవడంతో నేరుగా విఠలాపూర్ గ్రామ ప్రభుత్వ భూమిలో కాలువ నిర్మాణం చేపట్టి, అందులో నుంచి ఇవ్వాలని కోరారు. దీనివల్ల కేవలం అర కిలోమీటర్ సరఫ రా చేస్తే పంటలకు నీళ్లు అందుతాయని చెప్పారు. ఆ స్థలం అక్కడి రైతు లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించి పంటలను కాపాడాలని కోరారు.