చొప్పదండి, ఏప్రిల్ 8 : కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్సారెస్పీ(SRSP canal) డీ-86, డీ-87 కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి మండలానికి చెందిన చొప్పదండి, కొలిమికుంట, చాకుంట, వెదురుగట్టతో పాటు వివిధ గ్రామాల రైతులు చొప్పదండి పట్టణంలోని జాన్సీ హై సూల్ వద్ద కరీంనగర్-రాయపట్నం రహదారిపై సోమవారం ధర్నా(Farmers dharna) నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి, మకజొన్న పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇంతకు ముందు ఏప్రిల్ 20వ తేదీ వరకు నీళ్లు వచ్చేవని తెలిపారు. ఇప్పుడు నీళ్లు రాకపోవడంతో చివర దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరి తడికి నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కచ్చు భీమ రాజు, బండారి మల్లయ్య, ఇట్టెడి సత్తిరెడ్డి, బండారి రాజేశం, ఎముండ్ల బీరయ్య, ఐలయ్య, సాయిల్ల వెంకటయ్య, రాజయ్య, నరేశ్, శ్రీమాన్, పురం సెట్టి రామయ్య, సంకరి ఐలయ్య పాల్గొన్నారు