నర్సింహులపేట, మార్చి 14 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో టమాట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 25 కిలోల టమాట పెట్టెకు రూ.25 నుంచి రూ.50 మాత్రమే ధర పలుకుతున్నది. అంటే కిలో కు రూపాయి నుంచి రెండు రూపాయల లోపే. టమాట సాగు చేస్తే పెట్టుబడికి, కూలీలకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నర్సింహులపేట మండలం జయపురం, పెద్దనాగారం స్టేజీ జీపీ పరిధిలో టమాట సాగు చేస్తున్న రైతు లు యాకూబ్, అశోక్రెడ్డి పంటలను వదిలేశారు. టమాట అవసరమైన వారు తోటలో ఉచితంగా తీసుకెళ్లొచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టుచేయడం వైరల్గా మారింది.