మల్లాపూర్, మే 24: ఇష్టారాజ్యంగా వడ్లు కోత పెడుతుండటం, రైతుల కొనుగోళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పై రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం సెంటర్ను సందర్శించిన సెర్ప్ సీసీ రాజు, నిర్వాహకులపై మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట ధా న్యం కొనుగోలు కేంద్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు.
సెంటర్ నుంచి ఇప్పటి వరకు 40 లారీలకు పైగా ధాన్యాన్ని మిల్లులకు తరలించగా, 11 లారీల ట్రక్షీట్ల వివరాలే ఆన్లైన్లో నమోదు చేశారని రైతులు ఆరోపించారు. సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ధాన్యం నగదు కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని అన్నారు. రైతుల వివరాల డాటా ఎంట్రీని కొనుగోలు కేంద్రంలో కాకుండా పక్క గ్రామంలో చేయడంపై మండిపడ్డారు. ఈ విషయమై సీసీ రాజును వివరణ కోరగా.. రైతుల వివరాల డాటా ఎంట్రీ ప్రక్రియ ఆలస్యం జరిగిన మాట వాస్తమేనని, మిగిలిన ట్రక్ షీట్లను తెచ్చి ఎలాంటి కటింగ్ లేకుండా ఆన్లైన్లో నమోదు చేసి నాలుగు రోజుల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.