రామగుండం : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి దేశ రైతాంగం కేసీఆర్ పరిపాలన కోసం ఎదురుచూస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో రూ. 15 లక్షల డి.ఎం.ఎఫ్.టీ నిధులతో నిర్మిస్తున్న పుట్నూరు మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయం దండుగన్న నాటి పాలకుల వ్యవహారాన్ని తప్పని నిరూపిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రైతులను రాజులుగా మార్చాలనే సంకల్పంతో ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, సాగునీరు అందించి రైతుల ముఖాల్లో అనందం నింపుతున్నారని ప్రశంసించారు.