నారాయణపేట : రైతు వేదికలు రైతులకు విజ్ఞాన సర్వస్వాలుగా మారుతున్నాయని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఒక క్లస్టర్ పరిధిలోని రైతులందరికి రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ఆధునిక వ్యవసాయం పై అవగాహన కల్పించేందుకు ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు.
ఊట్కూరు మండలం కొల్లూరు గ్రామంలో రైతు వేదికను ఆయన ప్రారంభించారు. రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు నిత్యం అందుబాటులో ఉంటారని వారి సేవలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో లో టీఆర్ఎస్ పార్టీ నేతలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.