రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో సాగుకు నీరందక పొలాలు నెర్రెలు బారుతున్నాయి. అన్నపూర్ణ రిజర్వాయర్ నీళ్లు రాక, అనంతారం చెరువులోని కాలువ నీళ్లు ఊర చెరువులోకి పారక గ్రామంలోని పంటలు ఎండుతున్నాయి. దీంతో కడుపుమండిన రైతు ఉత్కం రాజయ్య ఎండిన తన పొలంలో పశువులను మేపాడు.