కొడిమ్యాల, జనవరి 8: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేటకు చెందిన బీజేపీ కార్యకర్త బుర్ర ప్రవీణ్ కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి రైతుబీమా ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ప్రవీణ్ తండ్రి గంగరాజు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, అతను రైతు బీమా నమోదు చేసుకొని ఉండటంతో రూ.5 లక్షల ప్రొసీడింగ్ కాపీ వచ్చింది. రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయమని, గుంట భూమి ఉన్న రైతుకు బీమా వర్తిస్తుందని రవిశంకర్ తెలిపారు. కార్యక్రమంలో స ర్పంచ్ మల్లేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.