హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో కార్పొరేట్ అనుకూల సర్కార్ ఉన్నదని.. దాని స్థానంలో కిసాన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. కర్ణాటకలోని గదగ్ జిల్లా ముందర్గి స్టేడియంలో ‘కిసాన్ జాగృతి వికాస్ సంఘ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా శుభప్రద్ పటేల్, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్కుమార్ హాజరయ్యారు.
శుభప్రద్పటేల్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టిందని, కాళేశ్వరంలాంటి సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్తో రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందన్నారు. కేంద్రం సహకారం లేకున్నా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి రైతు సరారే దేశంలో కూడా అవసరమని చెప్పారు. దీంతో సభలో జై కిసాన్ సరార్ అంటూ రైతులు మద్దతు పలికారు. అనంతరం గోపూజ, నాగలి పూజ ధనరాశి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రైతు సంఘం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి గోవింద్రావు పాల్గొన్నారు.