సోన్, ఫిబ్రవరి 3: పొలంలో విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రైతు బోర నర్సయ్య (45) రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని మక్కజొన్న సాగు చేస్తున్నాడు. ఈ భూమి గోదావరి ఒడ్డున ఉండటంతో అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం పంటల రక్షణకు ఎర్తింగ్ వైరు బల్బులు అమర్చాడు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వైర్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కరెం ట్ షాక్ తగిలి కిందపడిపోయా డు. నర్సయ్య కుమారుడు భరత్ గోదావరి ఒడ్డుకు వెళ్లి వచ్చేసరికి తండ్రి పడిపోయి ఉండటంతో చుట్టు పక్కల రైతుల సహాయంతో నిర్మల్లోని ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై షేక్ హైమద్ తెలిపారు.