భోపాల్: మధ్యప్రదేశ్లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.
అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను దవాఖానకు తీసుకెళ్లగా.. గుండెపోటుతో అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఎంతగా తిరిగినా ఎరువులు అందలేదని రామ్ప్రసాద్ మేనల్లుడు మక్కన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.