గూడూరు, మార్చి 1: వ్యవసాయ బావిలో ఉన్న మోటార్ను చూసేందుకు దిగిన రైతు విద్యుదాఘాతానికి గురై మరణిం చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని తాళ్లతండాలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు, మృతు డి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ మాన్సింగ్ (55) సోమవారం ఉదయం వరి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. బావిలో ఉన్న మోటార్ ఆన్చేయగా లెవల్ లేక ఆగిపోయింది. లెవల్ పోసి తిరిగి ఆన్ చేసినా నీళ్లు పోయకపోవడంతో మోటారును పరిశీలించేందుకు బావిలోకి దిగాడు. ఈ క్రమంలో షార్ట్సర్క్యూట్కు గురై బావిలో పడిపోయాడు. గమనించిన మాన్సింగ్ సోదరుడు లాల్సింగ్ ఇతర రైతుల సాయంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేసి మాన్సింగ్ను దవాఖానకు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి రెండో సోదరుడు రాజారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.